Saturday, May 4, 2024

క్రీడలకు పెద్ద పీట

- Advertisement -
- Advertisement -

Telangana Govt new sports policy

n ఇప్పటికే 30 పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ క్రీడలకు పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ మినీ స్టేడియంలో ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చీర్స్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని ఒలంపిక్స్ జ్యోతిని ప్రముఖ మాజీ హాకీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా పాలసీ ని రూపొందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించబోతున్నామని ఆయన తెలిపారు. క్రీడల అభివృద్ధి కి అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 30 పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి చేశామన్నారు.

ఒలంపిక్స్‌లో పతకాలు సాధించే ఆటగాళ్లకు నగదు పురస్కారాన్ని గతంలో కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రం నుంచి దేశం నుంచి ఒలంపిక్స్ వెళుతున్న 115 మంది ఆటగాళ్లుకు మంత్రి చీర్స్ చెప్పారు. ప్రతి ఆటగాడు తన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఇంచార్జ్ అధ్యక్షుడు సముద్రాల వేణుగోపాల చారి, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్, శాట్స్ అధికారులు ధనలక్ష్మి, వెంకయ్య, మనోహర్ గౌడ్, నర్సయ్య, చంద్రారెడ్డి, కోచ్‌లు, ప్రముఖ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, వివిధ క్రీడా అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News