- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే ఆర్జెసిసెట్ను రద్దు చేస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ వెల్లడించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిస్థితుల దృష్టా పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి గ్రేడ్ల ఆధారంగా ఎస్సి గురుకుల ఇంటర్లో ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 7వ తేదీ లోపు వెబ్సైట్లో మార్కులు అన్లోడ్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.tswreis.in వెబ్సైట్ చూడాలని తెలిపారు.
Telangana Gurukul Entrance Test 2021 Cancelled
- Advertisement -