Wednesday, May 1, 2024

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Report 36 new corona cases in 24 hrs

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో ఎక్కువగా నమోదైన కేసుల వల్ల ఆందోళనకర రీతిలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం గట్టెక్కిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 18,244 టెస్టులు చేయగా 31 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఒక్కరు కూడా చనిపోకపోవడంతో కోవిడ్ మరణాల సంఖ్య నిల్ కు చేరుకున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడైంది. ఒక్కరోజులోనే 73 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 కేసులు వెలుగుచూశాయి. ఐసోలేషన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 420 కాగా, మొత్తంగా ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఇదివరకటిలాగే యధావిదిగా 4, 411 గానే ఉంది. కోలుకున్నవారి సంఖ్య 7,86,753 మంది గా నమోదైంది.

Telangana Report 36 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News