Friday, May 10, 2024

తెలంగాణ క్రీడా విజయాలు దేశానికి ఆదర్శం

- Advertisement -
- Advertisement -
స్పోరట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

హైదరాబాద్:  దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో అన్ని రంగాలతో పాటు క్రీడారంగం కూడా అంచలంచెలుగా అభివృద్ధి చెందిందని స్పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలోని సాట్స్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఇటీవల ఐస్ స్కేటింగ్ విభాగంలో గోల్ మెడల్స్ సాధించిన బాలికల టీమ్, సిల్వర్ మెడల్ సాధించిన బాయ్స్ టీమ్‌లను, యాదాద్రి జిల్లా కాచారం కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నిషా ఇంజా ఢాకా లో నిర్వహించిన టోర్నమెంట్లో అండర్ 12 విభాగంలో అద్భుతంగా రాణించడంతో వారిని ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది కాలంలో ప్రణాళిక బద్ధంగా అనుసరించిన విధానాల ఫలితాలు ఇప్పుడు విజయాల రూపంలో ప్రస్ఫుటమై కనిపిస్తుందన్నారు. క్రీడారంగంలో తెలంగాణ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సాధిస్తున్న అద్భుత ఫలితాలే నిదర్శనమని అన్నారు.క్రీడా ప్రాంగణాల నిర్మాణం, మైదానాల అభివృద్ధి, క్రీడా పోటీల నిర్వహణ, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, క్రీడా సామాగ్రి పంపిణీ తదితర బహుముఖ వ్యూహంతో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో బాండీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నసీరుద్దీన్, టెన్నిస్ కోచ్ సాయి,స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News