Sunday, April 28, 2024

కెసిఆర్‌ని చూసేందుకు నాలుగో రోజు కొనసాగిన జనప్రవాహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ని చూసేందుకు నాలుగో రోజూ జన ప్రవాహం కొనసాగింది. గురువారం నాడు ఎర్రవల్లి లోని కెసిఆర్ నివాసం జన సందోహం తో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు,ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కెసిఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన వారు., తమ అభిమాన నేతను కలిసి కరచాలనం చేసి భుజం మీద చేతులు వేయించుకుని మరీ ఫోటోలు దిగారు. అభిమాన నేత తో సెల్ఫీలు తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు ప్రజలతో కెసిఆర్ మాట్లాడారు. ఓపికతో పేరు పేరునా పలకరించారు. తాము కెసిఆర్‌ను ఇంకా సిఎంగానే భావిస్తున్నట్టు వారి మనసులో కెసిఆర్ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గానే ముద్ర వున్నట్టు భావోద్వేగంతో ప్రకటించారు. ఈ సందర్భంగా కెసిఆర్ అభిమాని తెలంగాణ సాయి తిరుమల తిరుపతి దేవస్థానం చిత్రపటాన్ని తన అభిమాన అధినేతకు బహూకరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News