Tuesday, May 14, 2024

పిల్లల భవిష్యత్తే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం

- Advertisement -
- Advertisement -

తార్నాక : పిల్లల మంచి భవిష్యత్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉద్దేశమని డిప్యూటి మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి అన్నారు. మంగళవారం విద్యాదినోత్సం పురస్కరించుకొని తార్నాక డివిజన్ విజయ డెయిరీ క్వార్టర్స్,లాలాపేట తదితర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మన బడి అభివృద్ధి పనులను బిఆర్‌ఎస్ కార్మిక విబాగం అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

అనంతరం పాఠశాల పిల్లలకు పుస్తకాలను,స్కూళ్ యునిఫామ్‌లను డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా పంపిణి చే శారు.అనంతరం మాట్లాడుతు మన ఊరు మన బడితో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, తెలంగాణ విద్యారంగంలో దేశంలోనే నెంబర్ వన్ స్దానంలో ఉందని అ న్నారు.తెలంగాణ గురుకురాలను, మన బస్తీ,మన బస్తీ తదితర సంక్షేమ పథకాలను సృష్టించిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News