ఓటు నమోదు చేసుకున్న వారు జాబితాలో సరిచూసుకోవాలి : పిఎల్ శ్రీనివాస్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్సి ఓటర్ల లిస్ట్ విడుదలైంది. వచ్చే నెల 8 వరకు ఓటు నమోదుకు అవకాశాన్ని ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఓటు నమోదు చేసుకున్న వారు జాబితాలో సరిచూసుకోవలసిందిగా తెరాస సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎంఎల్సి ఓటర్ల లిస్ట్ని ఓటు నమోదు చేసుకున్న వారు సరిచూసుకోవాల్సిందిగా సూచించిన పిఎల్ శ్రీనివాస్. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 4,48,961. ఓటు నమోదుకు జనవరి 8 వరకు అవకాశం ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ఓటు నమదు చేసుకోవలసిందిగా పిఎల్ శ్రీనివాస్ సూచించారు. ఈ సారి జరగబోయే ఎంఎల్సి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని, ఓటర్ల నమోదు బాగా జరిగితే ఇంకా బాగుంటుందని వారు విజ్ఞప్తి చేశారన్నారు. jhttp://ceotserms1 telangana.gov.in/MLC_CLAIMS/Eroll_Forms/mlc_status.aspx లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ వారి ఓటును తనిఖీ చేసుకోవచ్చునని పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఓటు నమోదు చేసుకోనివారు ఓటు నమోదు చేసుకోవడానికి https://ceotserms1,telangana.gov.in/MLC/Forms 18 aspx.