Sunday, April 28, 2024

నిఘా నేత్రం నిద్రిస్తుంది

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి రోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో ప్రజలు పనుల కోసం వస్తుంటారు. మూడు కూడళ్ల కేంద్రంగా పిలువబడే కామారెడ్డి జిల్లా చుట్టుపక్కల నుండి నిత్యం వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చివెళ్తుంటారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల ద్వారా అనునిత్యం వ్యాపారస్థులు, ఉద్యోగులు, ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు.

ఇక్కడ పార్కింగ్ చేస్తున్న ప్రయాణికుల వాహనాల బధ్రత కోసం నిఘా లేకపోవడంతో చోరీలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో దొంగతనాలు గాని చోరీలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండటానికి పని చేసే సీసీ కెమెరాలు ఉండాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఉన్న సీసీ కెమెరాలు సైతం పని చేయకపోవడంతో దొంగతనం జరిగినప్పుడు ప్రజలు నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లైన నిజాంసాగర్ చౌరస్తా, కొత్త, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకుండా అలంకారప్రాయంగా మారాయి.

జిల్లా కేంద్రంలో నిత్యం ఏదో ఓ చోట ద్విచక్రవాహనాలు చోరీకి గురౌతున్నాయని ప్రజలు అంటుంన్నారు. సీసీ కెమెరాల నిర్వహణలో పోలీసులు శ్రద్ధ్ద చూపడం లేదని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో స్థంబాలకే సీసీ కెమెరాలు పరిమితమైయ్యాయని, పోలీస్ శాఖ అధికారులు సీసీ కెమెరాలన్నిటిని పరిశీలించి పని చేసే విదంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News