Sunday, April 28, 2024

తృణమూల్‌కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు: మమతాబెనర్జీ

- Advertisement -
- Advertisement -

There is no alternative to Trinamool Congress says Mamata

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ లేదని, రాష్ట్రంలో ఈ స్థానాన్ని మరే పార్టీ సాధించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టిఎంసికి చెందిన షెడ్యూల్డ్ తెగలు, కులాల నేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరింత మెరుగైన స్థితికి పార్టీ వెళ్తుందని ఆమె చెప్పారు. సోనార్ భారత్ (స్వర్ణభారత్)ను బిజెపి నాశనం చేసిందని, ఇప్పుడు సోనార్ బంగ్లా గురించి మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను ఉపయోగిస్తూ బూటకపు ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. తుపాన్ బాధితుల పునరావాసానికి తాము అంతా చేశామని, కానీ బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలతో సహా విపక్షాలన్నీ తుపాన్ సహాయ నిధులన్నీ టిఎంసి నాయకులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారని ఆమె విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లో తప్పులెంచే ముందు బిజెపి తనను తాను అద్దంలో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. పౌరసత్వసవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

There is no alternative to Trinamool Congress says Mamata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News