Tuesday, April 30, 2024

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎపిలోని అరకు నుంచి నగరానికి బైక్‌పై గంజాయి తీసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News