Sunday, May 5, 2024

రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Three killed, four injured in Gas Cylinder explosion in Rajasthan

 

జైపూర్: రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు కుప్ప కూలిన ఘటనలో ముగ్గురు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. మీతారామ్‌ఖేడా గ్రామంలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇంటి యజమాని పురుషోత్తమ్ భాంభీ(40), ఆయన భార్య, తల్లి మరణించారు. భాంభీ ముగ్గురు చిన్నారులు, మరో బంధువు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని ఉదయ్‌పూర్‌లోని హాస్పిటల్‌కు తరలించినట్టు వారు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News