- Advertisement -
నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
శ్రీనగర్: నగరంలోని పంతా చౌక్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్(జెఇఎం) ఉగ్రవాదులు మరణించగా నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరణించిన ఉగ్రవాదులలో ఒకడికి డిసెంబర్ 13న జెవాన్ ప్రాంత సమీపంలో పోలీసు బస్సుపై జరిగిన దాడితో సంబంధమున్నట్లు పోలీసులు తెలిపారు. నగర శివార్లలోని పంతా చౌక్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని, ఒక సిఆర్పిఎఫ్ జవానుతోసహా నలుగురు పోలీసులు గాయపడ్డారని కశ్మీరు ఐజి విజయ్ కుమార్ తెలిపారు. జెవాన్ దాడితో సంబంధమున్న ఉగ్రవాదులు అందరినీ హతమార్చినట్లు ఐజి ఒక ట్వీట్ లో తెలిపారు.
- Advertisement -