Tuesday, April 30, 2024

పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా…

- Advertisement -
- Advertisement -

Tractor roll over in Andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకుకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడడంతో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో 35 మంది ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News