Thursday, April 25, 2024

భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడుః బూర్గంపాడు పోలీస్‌లు బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై సంతోష్ సిబ్బందితో కలిసి మోరంపల్లి బంజర్‌లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న మినీ లారీను గుర్తించారు. వాహనాన్ని ఆపి తనిఖీలు చేయడంతో గంజాయి అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది.

లారీలో 125 పొట్లాలలో ఉన్న 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 53,15,000లు ఉంటుందని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులతో పాటు వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించామన్నారు. పాల్వంచ సీఐ నాగరాజు, ఎస్సైలు పి. సంతోష్, రమణారెడ్డి, యేసోబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News