Friday, May 3, 2024

చెవిలో ఇయర్ ఫోన్స్… రైల్వే ట్రాక్ దాటుతుండగా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెవిలో ఇయర్ ఫోన్స్ యువకుడి ప్రాణాలు తీసిన సంఘటన హైదరాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నరేష్ (19) అనే యువకుడు హైదరాబాద్‌లో మేస్త్రీగా పని చేస్తున్నాడు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బొల్లారం వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే అతడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News