Monday, September 22, 2025

టాటాఎస్‌ను ఢీకొట్టిన రైలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా భీమడోలు దగ్గర టాటాఎస్‌ను రైలు ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న సమయంలో గేటును ఢీకొట్టి పట్టాలపైకి వచ్చిన వాహనాన్ని ఢీకొట్టింది. రైలు ఢీకొని టాటాఎస్ పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రాణనష్టం తప్పింది. ఇంజన్ ఫెయిల్ కావడంతో దురంతో ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. డ్రైవర్ పరారీ కావడంతో యథావిధిగా ఇతర రైళ్లు నడుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News