Friday, April 26, 2024

నిమ‌జ్జ‌నంపై రేపు సుప్రీంకోర్టులో విచార‌ణ‌

- Advertisement -
- Advertisement -

Trial is set to begin tomorrow in Supreme Court on Ganesh immersion

 

న్యూఢిల్లీ : హుస్సేన్ సాగ‌ర్‌లో గణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నంపై సుప్రీంకోర్టులో గురువారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని ధ‌ర్మాస‌నం ముందు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌స్తావించింది. రేపు విచార‌ణ‌కు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ధ‌ర్మాస‌నానికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో రేపు విచార‌ణ చేప‌ట్టేందుకు కోర్టు అంగీక‌రించింది. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్ర‌హాల‌ను హుస్సేన్ సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నం చేయ‌కూడ‌దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News