Sunday, April 28, 2024

కరోనాతో టిఎంసి ఎంఎల్ఎ మృతి

- Advertisement -
- Advertisement -

Trinamool Congress MLA Tamonash Ghosh died

బెంగాల్: కరోనా తో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంఎల్ఎ తమోనాష్ ఘోష్ (60) బుధవారం మృతి చెందాడు. మే నెలలో ఎంఎల్ఎ తమోనాష్ కరోనా పాజిటివ్ నిర్ధారణ తెలింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఎంఎల్ఎ ఘోష్ మృతికి సంతాపం ప్రకటించారు. “చాలా.. చాలా విచారంగా ఉంది. 1998 ఫాల్టా పార్టీ కోశాధికారి నుండి 3 సార్లు ఎంఎల్ఎ అయిన తమోనాష్ ఘోష్ ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టవలసి వచ్చింది. 35 సంవత్సరాలుగా మాతో ఉన్నారు. అతను తన జీవితాన్ని ప్రజల కోసం పార్టీకి అంకితమిచ్చాడు. మా అందరి తరపున, అతని భార్య, అతని ఇద్దరు కుమార్తెలు, స్నేహితులు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక సంతాపం” అని ఆమె ట్వీట్టర్ లో పేర్కొంది. కాగా, ఇటీవల తమిళనాడుకు చెందిన డిఎంకె ఎంఎల్ఎ అనబళగన్ కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News