Saturday, May 11, 2024

చెరువులో మునిగి ఐదుగురు బాలికల మృతి

- Advertisement -
5 Girls Allegedly Drowned In Lake In Maharashtra
జల్నా: బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులోమునిగి ప్రాణాలు కోల్పోయిన విషాదఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్‌వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన ఐదుగురు చిన్నారులు పూడికలో చిక్కుకున్నారు. వీరిని అటుగా వెళ్తున్నవారు గమనించి బయటకు తీసి, తక్షణమే సమీప దవాఖానకు తరలించారు. అప్పటికే బాలికులు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతులందరూ 5 సంవత్సరాల నుంచి 7ఏళ్లలోపు వారేనని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
5 Girls Allegedly Drowned In Lake In Maharashtra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News