Tuesday, April 30, 2024

టిఎస్ ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్ ఎడ్‌సెట్ , పిఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.కె. మహ్మద్, సెక్రటరీ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ రావు, ఎడ్‌సెట్ , పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ రమేశ్ బాబు కలిసి గురువారం విడుదల చేశారు. కౌన్సెలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా వారు వివరాలు వెల్లడిస్తూ ఎడ్‌సెట్ ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ చెల్లింపులు సంబంధించిన వివరాలను 20వ తేదీ నుంచి 30 లోపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్‌సిసి, వికలాంగులు, స్పోర్ట్ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ 25 నుంచి 29వ తేదీ మధ్యలో ఉన్నట్లు తెలిపారు. వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నమోదు చేసుకోవాలి.

అక్టోబర్ 6న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మొదటి దశ సీట్ల కేటాయింపు అక్టోబర్ 9న జరగనుంది. అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అదే విధంగా పిఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి అంశాలు 20 నుంచి 25వ తేదీ మధ్యలో జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 25వ తేదీ మధ్యలో ఎన్‌సిసి, వికలాంగులు, క్రీడల అభ్యర్ధులకు సంబంధించి ఫిజికల్ పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 30వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 3వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు మధ్యలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News