Saturday, April 27, 2024

నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు దరఖాస్తు గడువు బుధవారం(ఆగస్టు 16)తో ముగియనుంది. ఈ నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, మంగళవారం రాత్రి వరకు 2,50,963 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1కు 74,026 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2కు 16,006 మంది, రెండింటికీ 1,60,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.

చివరి రోజు దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టీచర్ వృత్తిలో అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టిఆర్‌టి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News