Wednesday, May 15, 2024

ఎపిలో పిన్నపురం హైడెల్ నిర్మాణం ఆపండి

- Advertisement -
- Advertisement -

TS writes to KRMB against AP's hydel project

కృష్ణ బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఇఎన్‌సి లేఖ
అక్కడ కొత్త ప్రాజెక్టులను, పాత ప్రాజెక్టుల విస్తరణను ఆపాలని విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణానదీ జలాలను ఉపయోగించుకుంటూ పిన్నపురం వద్ద చేపట్టిన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్నివెంటనే నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం నాడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్‌కు లేఖ రాశారు. ఎపిలో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులతోపాటు, పాత ప్రాజెక్టుల విస్తరణ పనులను కూడా ఆపాలని బోర్డు చైర్మన్‌ను కోరారు. కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లేకుండా , అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందకుండా ఏవిధమైన ప్రాజెక్టులు చేపట్టవద్దని ఈఎన్సీ మురళీధర్ కృష్ణారివర్ బోర్డుకు చైర్మన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకుపోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News