హైదరాబాద్: విజయదశమి సందర్భంగా ట్యాంక్బండ్పై రెండు రోజుల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25,26న ట్యాంక్ బండ్పై అమలు చేయనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టిఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను నిరంకారి వైపు మళ్లించనున్నారు. ఇక్బాల్ మినార్, లిబర్టి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్వైపు అనుమతించరు.
పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్భవన్ వైపు నుంచి వచ్చే వాహనాలు నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్మినార్, అంబేద్కర్ విగ్రహం నుంచి సికింద్రాబాద్, బషీర్బాగ్ వైపు వెళ్లాలి. ఇక్బాల్ మినార్, లిబర్టీ, తెలుగుతల్లి విగ్రహం నుంచి వచ్చే వామనాలు ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, లకిడికాపూల్ మీదుగా మెహిదీపట్నం లేదా ఖైరతాబాద్ వైపు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ మీదుగా లోయర్ ట్యాంక్బండ్ మీదుగా మళ్లించనున్నారు. ఇది కూడా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం ర్యాలీ మీద ఆధారపడి ఉంటుంది.