Tuesday, April 30, 2024

పాదచారుడిని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two Killed in Road Accident in Vizianagaram

విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున భోగాపురం మండలంలోని అవ్వపేట బ్రిడ్జి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ పాదచారుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ పైనుంచి పడిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన పాదచారుడిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Two Killed in Road Accident in Vizianagaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News