Tuesday, May 7, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సర్పంచ్‌లు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సర్పంచ్‌లు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని పుడుకొట్టాయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు సమావేశా ఏర్పటు చేశారు. నలుగురు సర్పంచ్‌లు కలిసి ఓ కారులో వెళ్తుండగా వనతిరుపుతి సమీపంలో మదురై-ట్రిచీ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు కరప్పుసామి(52), అభిమాన్ రాజ్(53)గా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు శంకర్, సముత్రామ్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఆకట్టుకుంటోన్న ‘జవాన్’ ట్రైలర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News