Saturday, May 4, 2024

కశ్మీరులో జవాన్ల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Two terrorist dead in Jammu Kashmir encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు పంపోర్ ప్రాంతంలోని ఖ్రూ వద్ద గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఇందుకు ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. సంఘటన స్థలి నుంచి ఆయుధాలు, మందుగుండ సామగ్రితోసహా కొన్ని నిషిద్ధ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. దక్షిణ కశ్మీరులో పౌరుల హత్యకు బాధ్యులైన హిజ్బుల్ ముజాహిదీన్ దాడి ముఠా సభ్యులుగా వీరిని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News