Friday, April 26, 2024

కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

terrorists-killed

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా దగ్గర భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. ఆర్మీ, సిఆర్ఫీఎఫ్, పోలీస్ బలగాల సంయుక్తంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వాన్‌పోరా పోలీసులు తెలిపారు.

Two terrorists killed in encounter at Kulgam district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News