Friday, April 26, 2024

మహబూబాబాద్ లో రైలు ఢీకొట్టడంతో ఇద్దరు ట్రాక్ మెన్లు మృతి

- Advertisement -
- Advertisement -

Two track men dead in collided with Train

 

మహబూబాబాద్: రైలు ఢీకొట్టడంతో ఇద్దరు ట్రాక్‌మెన్లు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రైల్లే స్టేషన్‌కు సమీపంలో ఎండి పాషా(40), కమలాకర్ చారి(36) ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఒకటో నంబర్ ట్రాక్‌పైకి రైలు రావడంతో రెండో ట్రక్‌పైన నిలబడ్డారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఒకే సారి రెండు రైళ్లు రావడంతో వాళ్లు గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News