Tuesday, April 30, 2024

ప్రియుడిని కట్టేసి… యువతిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Two youths raped a young woman in Guntur

అమరావతి: ప్రియుడిని కట్టేసి, యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో సీతానగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే… సీతానగరం పుష్కర్ ఘాట్ లో శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిన్న రాత్రి కృష్ణానది తీరంలో ఇసుక తిన్నెపై కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు గుర్తుతెలియని యువకులు దాడి చేశారు. యువకుడిని చితకబాది యువతిపై అత్యాచారం జరిపారు. బాధితురాలు ఆదివారం ఉదయం తాడేపల్లి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Two youths raped a young woman in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News