Sunday, April 28, 2024

జవహర్ నగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువులో గుర్తు తెలియని (45) వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం చెరువులో నుంచి బయటకు తీయడానికి ఈతగాళ్లు లేకపోవడంతో పెట్రోలింగ్ సిబ్బంది రవీందర్, నాగరాజు స్వయంగా రంగంలోకి దిగి చెరువలో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. మున్సిపాలిటీ సిబ్బంది కోసం ఎదురుచూడకుండా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించిన పెట్రోలింగ్ సిబ్బందిని జవహర్ నగర్ ప్రజలు అభినందిస్తున్నారు. జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎవరిది అని తెలిస్తే విచారణ చేయడం సులభం అవుతుందని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News