- Advertisement -
ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాతృమూర్తి (89) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె గుండెపోటుతో మృతి చెందారని హర్షవర్ధన్ తన ట్విట్టర్ ట్వీట్ చేశారు. భూలోకంలో ప్రియమైన వ్యక్తి తన తల్లేనని, స్వర్గానికి వెళ్లినందుకు చింతిస్తున్నానని చెప్పారు. తనకు మార్గం చూపించిన తల్లి లేకపోవడంతో తనని ఎంతో కలిచివేసిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు హర్షవర్ధన్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
- Advertisement -