Sunday, April 28, 2024

2 కె రన్‌కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : 2 కె రన్‌కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కె రన్ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంపగోవర్ధ్దన్ మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణకు పరుగు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఉదయం నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు. యోగ వ్యాయమం చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రన్‌లో చిన్నారులు, యువకులు, వృద్ధ్దులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఆదివారం కళాభారతిలో చేపట్టిన సాంసృతిక ప్రదర్శనలు, సాహిత్య దినోత్సవం ప్రత్యేకతను తెలియజేశాయని చెప్పారు.

రూ.6 కోట్లతో కళాభారతి ఆడిటోరియం నిర్మించినందుకు దానికి ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన సాంసృతిక కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయని తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రతాప్ కామారెడ్డి కళాక్షేత్రంలో శాస్త్రీయ నృత్యాలు, చిన్నారులకు చేర్పించి కామారెడ్డి జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేళ్లలో జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధ్ది సాధించిందని, వాటి విజయ గాదలను ప్రజలకు తెలియపరచడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడాతూ సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయం కొనియాడారు. సమావేశంలో రాష్ట్ర ఊర్దు అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, డిఎస్పీ సురేష్, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News