Tuesday, May 14, 2024

వరుడు కిడ్నాప్… వివాహం రద్దు చేయాలని ఫోన్ చేయించి…

- Advertisement -
- Advertisement -

UP Groom abducted from mandap

 

లక్నో: వరుడిని కిడ్నాప్ చేసి పెళ్లి రద్దు చేయకపోతే వధువు చంపుతామని బెదిరించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జుగల్ కుశ్వా అనే యువకుడు షాపూర్ లో నివసిస్తున్నాడు. తన గ్రామానికి సమీపంలో ఉన్న యువతితో జుగల్ వివాహం నిశ్చితార్థమైంది. పెళ్లి ఒక రోజు ముందు ముగ్గురు వ్యక్తులు జుగల్ ను కిడ్నాప్ చేసి ఓ తోటలోనికి తీసుకెళ్లారు. అనంతరం వరుడితో ఫోన్ చేయించి పెళ్లిని రద్దు చేశారు. ఆ వధువును పెళ్లి చేసుకుంటే ఆమెను చంపేస్తామని బెదిరించారు. నిర్మానుష్యమైన ప్రదేశంలో వరుడిని వదిలిపెట్టడంతో అక్కడ నుంచి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బిండ్కి కోట్వాలి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లి వేడుకకు రక్షణ కల్పిస్తామని వివాహం చేసుకోవచ్చని పోలీస్ అధికారి అసుతోష్ కుమార్ సింగ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News