Tuesday, April 30, 2024

జానపద నేపథ్యంలో ఐటమ్ సాంగ్

- Advertisement -
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందట. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మంచి ట్యూన్ ఇచ్చాడని తెలిసింది. ఇక ఈ సాంగ్ జానపద నేపథ్యంలో సాగుతుందని.. పక్కా మాస్ అంశాలు ఈ సాంగ్‌లో ఉండబోతున్నాయని సమాచారం. ఈ స్టార్ కంపోజర్ ఇప్పటికే ఈ పాటను కూడా రికార్డ్ చేశాడని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను తీసుకున్నారు. కాగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ ఈసారి కూల్‌గా కూర్చొని పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా సుక్కు,- దేవీ కాంబినేషన్‌లో ఐటమ్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా కోసం ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో చూడాలి. ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News