Saturday, April 27, 2024

వచ్చే ఏడాదికి అమెరికా కాన్సులేట్ కొత్త భవనం

- Advertisement -
- Advertisement -

US consulate

 

నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలోని భవనం టాపింగ్ అవుట్ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ కెన్నెత్ జస్టర్‌తో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది చివరికల్లా హైదారాబాద్‌లో నూతన యూఎస్ కాన్సులేట్ భవన నిర్మాణం పూర్తిచేస్తామని భారతదేశ యుఎస్ కాన్సులేట్ జనరల్ కెన్నెత్ ఐ జస్టర్ ప్రకటించారు. భారత్, అమెరికా దేశాల మధ్య మరింత సత్సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నానక్‌రాం గూడాలో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ నూతన కాన్సుల్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన టాపింగ్ ఔట్ కార్యక్రమంలో కెన్నెత్ ఐ జస్టర్‌తో కలిసి కె.టి.రామారావు పాల్గొన్నారు. అలాగే టోలీచౌకీలోని కుతుబ్ షాహీ టూంబ్స్‌ని భారతదేశ యుఎస్ కాన్సులేట్ జనరల్ కెన్నెత్ ఐ జస్టర్ సందర్శించారు. నూతనంగా పునరుద్ధరించిన రెండు టూంబ్స్‌ని ఆయన ప్రారంభించారు. సంస్కృతిని కాపాడటంలో యుఎస్ ఎప్పుడూ ముందుంటుందని భారతదేశ యుఎస్ కాన్సులేట్ జనరల్ కెన్నెత్ ఐ జస్టర్ అన్నారు.

టోలీచౌకీలోనీ కుతుబ్‌షాహీ టూంబ్స్‌ని సందర్శించారు. తారామతి, ప్రేమమతి టూంబ్స్‌కి పూర్వ వైభవం తెచ్చేందుకు గతేడాది అమెరికన్ కాన్సులేట్.. యుఎస్ అంబాసిడర్ ఫండ్ నుంచి లక్షా 3వేల డాలర్లను అగాఖాన్ ఫౌండేషన్‌కి మంజూరు చేసింది. ఈ మేరకు తారామతి, ప్రేమామతి టూంబ్స్‌లో ఉన్న పగుళ్లను సరిచేసి వాటికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చింది అగాఖాన్ ఫౌండేషన్. ఈ మేరకు మంగళవారం టూంబ్స్‌ని సందర్శిచిన యుఎస్ కాన్సులేట్ జనరల్ కెన్నెత్.. నూతనంగా పునరుద్ధరించిన రెండు టూంబ్స్‌ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు సాయం చేస్తామన్నారు.

రెండు దేశాల మధ్య సత్సంబంధాలు : మంత్రి కెటిఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికాకు మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మంచి చేస్తుందని మంత్రి కె.టి.రామారావు అన్నారు. అమెరికా కాన్సులేట్ నూతన కాన్సుల్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన టాపింగ్ ఔట్ కార్యక్రమంలో కెన్నెత్ ఐ జస్టర్‌తో కలిసి మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, అనేక మిలియన్ల డాలర్లతో నిర్మిస్తున్న కాన్సుల్ జనరల్ కార్యాలయం వచ్చే సంవత్సరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ చేసిన ప్రకటనను మంత్రి కెటిఆర్ స్వాగతించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు.

తాజాగా ఇండియాలో పర్యటన విజయవంతం చేయడానికి భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ కృషి చేశారని పేర్కొన్నారు. టాపింగ్ ఔట్ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మంత్రి కెటిఆర్, ఇంత భారీ కాన్సుల్ జనరల్ నూతన కార్యాలయం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణంలో దక్కను పీఠభూమి నిర్మాణ శైలిని ఇక్కడి సహజత్వానికి దగ్గరగా డిజైన్‌ను రూపొందించిన అమెరికన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి కాన్సుల్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ నగర సంస్కృతి సంప్రదాయాలకు ఒక చిహ్నంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశంలో అమెరికా రాయబారి జస్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి సారి భారతదేశంలో పర్యటించిన నగరం హైదరాబాద్ అని, అప్పుడు జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రీనర్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి మిత్రుడిగా ఉంటూ వస్తున్నారని చెప్పారు. ఇందుకు మంత్రి కెటిఆర్, అమెరికన్ రాయబారికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి నగరంలో భారీ కాన్సుల్ జనరల్ కార్యాలయం రావడం ఇక్కడి పౌరులకే కాకుండా ఇతర రాష్ట్రాల పౌరులకు కూడా సౌకర్యంగా ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో అమెరికా మరియు తెలంగాణల మధ్య మరింత దృఢమైన బంధం ఏర్పడుతుందని మంత్రి కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

US consulate building is to be completed next year
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News