Friday, May 3, 2024

మారుతల్లితో అక్రమ సంబంధం… మొండెం నుంచి తలను వేరు చేసి…

- Advertisement -
- Advertisement -

లక్నో: మారు తల్లితో కుమారుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమెను భర్త, తన కుమారులు, అల్లుడితో కలిసి హత్య చేసి అనంతరం మొండెం నుంచి తల వేరు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బండా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మధ్యప్రదేశ్ రాష్ట్రం చతర్‌పూర్ జిల్లాలో మాయా దేవి- రామ్‌కుమార్ అహిర్ వార్ అనే దంపతులు నివసిస్తున్నారు. రామ్ కుమార్‌కు రెండో భార్యగా మాయ దేవి ఉన్నారు.  రామ్ కుమార్ తనయులలో ఒకరితో మాయ దేవి వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరో కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో అసలు విషయం బయటపడింది.

రామ్ కుమార్ తన కుమారులు సూరజ్ ప్రకాశ్, బ్రిజేష్, అల్లుడు ఉదయ్‌భానుతో కలిసి తన రెండో భార్యను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే జీపులో యుపి-ఎంపి సరిహద్దులోని చమ్రహా గ్రామం శివారులోకి ఆమెను తీసుకెళ్లారు. ఆమెను గొంతు నులిమి చంపి అనంతరం గొడ్డలితో నరికి మొండెం నుంచి తలను వేరు చేశారు. చేతి వేళ్లను కూడా నరకడంతో పాటు తల వెంట్రుకలను కట్ చేశారు. మొండానికి కొంచెం దూరంలో తలను పడేసి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని తల లేని మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొండానికి కొంచెం దూరంలో తల కూడా లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతురాలు మాయదేవి అని తేలడంతో వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News