Tuesday, April 30, 2024

తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి విసిగా వాకాటి కరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్స్‌లర్‌గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ విసి రవీందర్ గుప్తా ఇటీవలే చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్ గుప్తాను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులు ఒకటి రెండు సార్లు యూనివర్సిటీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విసికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పామని వర్సిటీకి వచ్చిన చాలా మందిని విజిలెన్స్ అధికారులు విచారించారు. అలాగే యూనివర్సిటీ ఖాతాల లావాదేవీలను కూడా నిశితంగా పరిశీలించారు. గతంలో వర్సిటీలో పని చేసిన రిజిస్ట్రార్లను విచారించి, పలు కీలక విషయాలను రాబట్టారు. వీటన్నింటిని పరిశీలించి పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News