Sunday, April 28, 2024

ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్‌ తేజ్

- Advertisement -
- Advertisement -

తమ తొలి తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్.. రెనైసెన్స్ పిక్చర్స్‌తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. అతని 13వ చిత్రంగా రాబోతున్న ఈ నూతన చిత్రం నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది.ఫ్రంట్ లైన్ హీరోల స్ఫూర్తి, వైమానిక దాడులతో పోరాడుతున్నప్పుడు వారు ఎదుర్కొనే సవాళ్లను మునుపెన్నడూ చూపని విధంగా రూపొందబోతోంది.

ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ “ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా బిగ్ స్క్రీన్‌పై వారి సాహసాలని చాటే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. గ్లోబల్ దిగ్గజం సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్‌ల భాగస్వామ్యంతో మేము చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి గొప్ప నివాళిగా భావించే చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన శిక్షణ పొందాను”అని అన్నారు. శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రం 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లోని చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్‌లో పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైయింది. పద్మజా కొణిదెల కెమెరా స్విచాన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు.

Varun Tej New Film launched with Pooja Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News