Tuesday, May 7, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. నాగర్ కర్నూల్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గౌహతి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలను ప్రకటించింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థి వావిలాల చిద్విలాస్ రెడ్డి ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ర్యాంక్ (ఎఐఆర్) 1 సాధించారు. రమేష్ సూర్య తేజ రెండో ర్యాంకు, రాఘవ గోపాల్ నాలుగో ర్యాంకు, బి.అభినవ్ చౌదరి ఏడో ర్యాంక్ సాధించారు. ఈ ఏడాది, ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన రెండు పేపర్లకు మొత్తం 1,80,372 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 43,773 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 36,204 మంది విద్యార్థులు, 7,509 మంది విద్యార్థినులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News