Sunday, April 28, 2024

బెంగాల్ లో కొనసాగుతున్న తుదివిడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

Voting for eighth and final phase in West Bengal

కోల్‌కతా: బెంగాల్ లో తుదివిడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. 8వ విడతలో 35 నియోజకవర్గల్లోని స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. తుదివిడత ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. బీర్భుమ్ జిల్లాలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. మే 2న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు లెక్కించనున్నారు. ఉత్తర కోల్‌కతాలోని కాశీపూర్-బెల్గాచియాలోని ఒక పోలింగ్ కేంద్రంలో నటుడు, బిజెపి నాయకుడు మిథున్ చక్రవర్తి ఓటు వేశారు. తెల్లవారుజామునుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు క్యూకట్టారు. చివరిదశ ఓటింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News