Wednesday, May 1, 2024

పైసలు పోయినా.. పంట బతకాలె

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ: వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించా రు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సా గుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను సిఎం కెసిఆర్ ఆదేశించారు. అందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదని స్పష్టం చేశారు. పోయినా ఫర్వాలేదు.. పంటలు కాపాడాలని’ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రా ష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల కోసం మంత్రులు, ప్ర జాప్రతినిధులు,

ఇరిగేషన్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు -రంగారెడ్డి పనుల పురోగతిని కూడా సిఎం కెసిఆర్ సమీక్షించారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు జూలై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్ రావు సూచించారు. ఈ వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటిని విడుదలకు కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సిఎం ఆదేశించారు.

నీటి నిల్వలపై ఆరా
జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలను, మిషన్ భగీరథ అవసరాలను సంబంధిత అధికారుల నుండి సిఎం కెసిఆర్ ఆరా తీశారు. జూలై మొదటి వారం లో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అ నుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలను సిఎం ఆరా తీశారు.ప్రస్తుతం రంగనాయక సాగర్ జలాశయంలో 3 టిఎంసిలకు గాను 0.69 టిఎంసిల నీ టి నిల్వ మాత్రమే ఉన్నాయని ఇంజినీర్లు తెలుపగా, రంగనాయక సాగర్‌కు రెండు టిఎంసిల నీటిని మిడ్ మానేరు తరువాయి 12లో
జలాశయం నుండి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులను సిఎం ఆదేశించారు. తద్వారా రంగనాయక సాగర్ జలాశయం కింద ఆయకట్టుకు వానాకాలం పంటకు నీరందించడానికి వీలవుతుందని అన్నారు.

ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టిఎంసిల నీటి నిల్వలు ఆగస్టు చివరి వరకు 3 తడులకు సరిపోతాయని, ఆ తర్వాత మరో మూడు తడులకు 5 టిఎంసిలు అవసరమని ఇంజనీర్లు సూచించారు. దీని కోసం ఆగస్టులో 5 టిఎంసిలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాం సాగర్‌కు తరలించాలని సమావేశం నిర్ణయించింది. ఆగస్టు నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టిఎంసిల నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం మల్లన్నసాగర్‌లో మరో 10 టిఎంసిలు నింపాలని నిర్ణయించారు. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ ఫ్లో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయని,

రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపి పెట్టుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. దీని కోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని సాగునీటి అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సంవత్సరం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సాగునీటి శాఖ సన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి సూచించారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పురోగతిపై సమీక్ష
పాలమూరు రంగారెడ్డి పనులను సిఎం కెసిఆర్ సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ల నుండి పనులను తొలగించి వాటిని సమర్థులైన కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు. అదే విధంగా తాగునీటి అవసరాలకు నీటిని మిడ్ మానేరు నుండి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సూచించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికై చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం రూ. 4252.53 కోట్లకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని ఇఎన్‌సి మురళీధర్ తెలిపారు.

కేంద్ర జలసంఘంలో వార్ధా బ్యారేజి ప్రాజెక్టు డిపిఆర్ పరిశీలన ప్రారంభమైనందున త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయాలని ఇఎన్‌సి సిఎంను కోరారు. ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సంబంధిత అధికారులకు సిఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సిఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్‌సిలు మురళీధర్, ఎన్. వెంకటేశ్వర్లు, శంకర్, చీఫ్ ఇంజనీర్లు హమీద్ ఖాన్, రమణా రెడ్డి, శ్రీనివాస్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News