Tuesday, April 30, 2024

రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

water supply interruption tomorrow in Hyderabad

హైదరాబాద్: నగరంలో రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా మెయిన్ పైప్‌లైన్ జంక్షన్ పనులు, చాంద్రాయణగుట్ట నుంచి కందికల్ గేట్ క్రాస్‌రోడ్ వరకు పైపులైన్ విస్తరణ పనులు చేపడుతున్న కారణంగా నేడు గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటలవరకు 24గంటల పాటు పనులు కొనసాగుతాయని వాటర్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతరాయం ఉండే ప్రాంతాలు: ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం.1 పరిధిలోని మిరాలం రిజర్వాయర్, కిషన్‌బాగ్ ప్రాంతం, ఓఅండ్ ఎమ్ డివిజన్ నెం. 2 పరిధిలో ని అల్జుబైల్ కాలని, అలియాబాద్ రిజర్వాయర్ ప్రాంతం, బాలాపూర్ రిజర్వాయర్ ఆప్రాంతాలు ఉన్నట్లు, నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News