Sunday, April 28, 2024

కొత్తగా విధుల్లోకి చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాం

- Advertisement -
- Advertisement -
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి డాక్టర్లను అందిస్తోంది
ఎపి విద్యార్ధులు వైద్య విద్య కోసం తెలంగాణకు వస్తున్నారు
శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా విధుల్లోకి చేరిన ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని ఆయన వెల్లడించారు. ఎపి విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించేందుకు తెలంగాణకు వస్తున్నారన్నారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఎపిలోని పాత ఐదు మెడికల్ కాలేజీల్లోనే అక్కడి విద్యార్ధులకు 15 శాతం సీట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. అదే మన దగ్గర కొత్తగా ఏర్పాటైన 26 మెడికల్ కాలేజీల్లో 100 శాతం ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ విద్యార్ధులకు అందుబాటులో వున్నాయని పేర్కొన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని, ఆసుపత్రిని అత్యా ధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజ్‌లు ప్రారంభం కానున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో 2 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశాయని, కెసిఆర్ తొమ్మిదేళ్ల కాలంలో 29 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశారని ప్రశంసించారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి డాక్టర్లను అందిస్తోందని మంత్రి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News