Sunday, May 12, 2024

వర్గీకరణకు మద్దతు ఇస్తే మేము కాంగ్రెస్‌కు అండగా ఉంటాం: మందకృష్ణ మాదిగ

- Advertisement -
- Advertisement -

వర్గీకరణకు కచ్చితంగా మద్దతు ఇస్తాం
రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే హామీ
ఎస్సీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి వినతిపత్రం అందించిన మందకృష్ణ మాదిగ బృందం

మనతెలంగాణ/హైదరాబాద్: మా ఆవేదన చెప్పడానికి గాంధీ భవన్ వచ్చానని, దళితుల మధ్య జరుగుతున్న అసమానతలు సరిద్దిద్దే ప్రయత్నం చేస్తున్నానని మందకృష్ణ మాదిగ వెల్లడించారు. వర్గీకరణ అంశం, సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్ అని, అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని లోకూర్ కమిటీని కాంగ్రెస్ వేసిందని మంద కృష్ణ అన్నారు. వర్గీకరణ అమలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో రద్దు అయ్యిందని, కానీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్‌కు సోమవారం మందకృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసిసి ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మందకృష్ణ సమావేశం అయ్యారు.

ఎస్సీలలో ఏ,బి,సి,డి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కమిషన్లు వేసిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదని మంద కృష్ణ అన్నారు. బిజెపి వర్గీకరణ చేస్తా అన్నది చెయ్యలేదని, బిజెపి మీద ఒత్తిడి పెంచండని రాహుల్ గాంధీని కలిశానని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి పెంచండి అంటూ లేఖ ఇవ్వలేదు, కనీసం తెలంగాణ ఎంపిలు కూడా వర్గీకరణ విషయం అడగలేదని, కోమటిరెడ్డి, ఉత్తమ్ బయట మద్దతు ఇస్తున్నారని, కానీ, పార్లమెంట్‌లో కనీసం మాట్లాడడం లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. మొన్న పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు వర్గీకరణ విషయం ఎందుకు ప్రస్తావించలేదని మందకృష్ణ మాణిక్ రావును ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే మద్ధతు ఇస్తామని మందకృష్ణకు హామీనిచ్చారు. భవిష్యత్ కార్యచరణ ఉంటుందని మందకృష్ణకు ఆయన మాట ఇచ్చారు. వర్గీకరణకు మద్దతు ఇస్తే తాము అండగా ఉంటామని మందకృష్ణ మాదిగ మాణిక్ రావుతో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News