Saturday, May 4, 2024

స్నానం వద్దు…. సంభోగం కావాలి… భర్త వేధింపులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో భర్తలు ఇంటి వద్ద ఉండి భార్యాలను వేధిస్తున్నారు. దేశంలో గృహ హింసకు పాల్పడుతున్నారని కేసులు చాలా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. దంపతుల 24 గంటలు ఇంట్లో ఉండడంతో భార్య భర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కర్నాటక జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిహార్ ప్రాంతంలో 31 ఏళ్ల భర్త కిరాణ దుకాణం తెరవకుండా ఇంటి దగ్గర ఉంటున్నాడు… స్నానం చేయకుండా తనని ఇబ్బంది పెడుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. స్నానం చేయకుండా భర్త నుంచి వాసన వస్తుందని, అలాగే సంభోగం చేయాలని బలవంతం చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తండ్రిని చూసి కూతురు కూడా వారం రోజుల నుంచి స్నానం చేయడం లేదని పేర్కొంది. బనాస్‌వాడి ప్రాంతంలో భార్య చికెన్ బిర్యానీ చేయడంలేదని ఆమెపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.

 

wife complaint on husband.. stop bathing, want sex
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News