హైదరాబాద్: మహమ్మారి కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమంతోపాటు పలు సందేశాత్మక వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం పరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అలాగే, ఈ లాక్డౌన్ సమయంలో తన పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా, తన తల్లితోపాటు చెల్లెల్లు, తమ్ముళ్లతో దిగిన ఓ ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీరందరిని మిస్ అవుతున్నానని పోస్ట్ పెట్టారు. ”లాక్డౌన్కు ముందు ఓ ఆదివారం రోజున తీసిన ఫొటో ఇది. నా ప్రియమైన ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. మీలో చాలా మంది కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. త్వరలోనే మళ్లీ ఇలాంటి సమయం మనకు తిరిగి రావాలని ఆశిస్తున్నాను” అని చిరు పేర్కొన్నారు. చిరంజీవి తన తల్లి అంజనా దేవితోపాటు చెల్లెల్లు మాధవి, విజయలు, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్తో దిగిన ఈ మెగా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు సరసన మరోసారి అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
On a Sunday before lockdown. Missing meeting the dear ones. I am sure most of you share this feeling too. Hope those times will return for all of us..soon!
ఓ ఆదివారం – అమ్మ దగ్గర
నేను- చెల్లెల్లు తమ్ముళ్లు#StayHomeStaySafe pic.twitter.com/43tiOwQOLD
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2020
Chiru with Mother, sisters, brothers Photo Share in Twitter