Friday, April 26, 2024

భర్త కళ్లుగప్పి పరాయి వ్యక్తితో ఉడాయించిన భార్య

- Advertisement -
- Advertisement -

Wife Escape Her Husband in Secunderabad

సికింద్రాబాద్ : మంచినీళ్ల బాటిల్ తెచ్చుకుంటాని చెప్పి కూమారునితో సహా ఓ వివాహిత పరా యి వ్యక్తితో బైక్‌పై ఉడాయించిన ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివారాల్లోకెలితే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ప్రభుదాస్ తన భార్య రమ్య, కుమారుడు ప్రకాశ్‌తో ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చా రు. 4వ తేదీ తిరుగు ప్రయాణంలో జొధ్‌పూర్‌కు వెళ్లడానికి ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్ చేసుకోవడంతో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఆ మహిళ మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకుంటానని భర్త ప్రభుదాస్‌కు చెప్పి కుమారుడుని తీసుకొని రైల్వేస్టేషన్ బయటకు వచ్చిం ది. స్టేషన్‌కు ఎదురుగా ఓ వ్యక్తి బైక్‌పై ఉండ గా ఆ మహిళ కుమారునితో కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లి బైక్‌పై కూర్చుని వెళ్లిపోయింది.

వివాహిత బైక్‌పై వెళుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎంతసేపైనా తన భార్య రాకపోవడంతో అనుమానం వచ్చి ప్రభుదాస్ రైల్వే స్టేషన్ ముందు వెతికాడు జాడ కనిపించకపోవడంతో అక్కడ ఉన్నవారిని వాకబు చేశాడు. ఓ మహిళ పిల్లవాడితో పరుగెడుతూ బైక్‌పై వెళ్లిపోయిందని అక్కడ ఉన్నవాళ్లు చెప్పడంతో ఆందోళనకు గురైన ప్రభుదాస్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమయిన పోలీసు లు రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సిసి ఫుటేజీని పరిశీలించారు. అపరిచిత వ్యక్తితో కలిసి బైక్ పై వెళుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో కనిపించాయి. భర్త ప్రభుదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వ్యక్తి ఎవరు, ఆమెను ఎందుకు తీసుకు వెళ్లాడనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News