Friday, March 29, 2024

ఢిల్లీకి వస్తే ఏకే 47తో కాల్చేస్తామన్నారు: సంజయ్‌రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై : శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ఈ బెదిరింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా మాదిరి గానే తననూ చంపేస్తామని వారు హెచ్చరించారని రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కొందరు నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఢిల్లీకి వస్తే ఏకే 47 తుపాకీతో కాల్చి చంపేస్తామని వారు హెచ్చరించారు. మూసేవాలకు పట్టిన గతే నాకూ పడుతుందన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. ” అని రౌత్ మీడియాకు తెలిపారు. అయితే ఈ విషయంపై తాను ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించట్లేదని ఆయన ఆరోపించారు. “ గతం లోనూ నాకు ఇలాగే బెదిరింపులు వచ్చాయి. కానీ రాష్ట్ర హోం మంత్రి ఇది కేవలం స్టంట్ అని కొట్టి పారేస్తున్నారు. ప్రతిపక్ష నేత భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అని రౌత్ దుయ్యబట్టారు.

అయితే రౌత్ ఫిర్యాదుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఇటీవల మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News