Friday, April 26, 2024

భర్తను చంపి ‘మాసికం’ చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

Woman Arrested for killing husband in Jayashankar Bhupalpally

జయశంకర్ భూపాలపల్లి: జీవితాంతం తోడుగా ఉండేందుకు తాళికట్టిన భర్తనే చంపి ఏకంగా మాసికం కూడా చేసిన భార్య కర్కషత్వం గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. భూపాలపల్లి మండలంలోనే సంచలనం సృష్టించిన ఈ ఘాతుకం చర్చనీయాంశమైంది. నమ్మి భార్యతో ఆమె పుట్టింటికి చేరిన భర్త కాళేశ్వరం రమేష్(37)ను పథకం ప్రకారం కొందరితో గుట్టు చప్పుడు కాకుండా భార్య శారధ(30) చంపి అడవిలో శవాన్ని పూడ్చిపెట్టింది. అయితే మరో అడుగు ముందేసి తన భర్త కనిపించడం లేదని కూడా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్య మండలంలోని నెరేడుపల్లిలో గత నెల 4న జరిగిందని మృతుడి భార్య స్వయాన చెప్పి పోలీసులకు లొంగిపోయింది. రమేష్‌ను చంపింది ఏ మాత్రం అనుమానం రాకుండా ఆమె ప్రవర్తించడం ఆసక్తి కలిగించింది.

నెల మాసికం నాడే రట్టయిన గుట్టు

గత నెల మొదటి వారంలో పుట్టిల్లు నెరేడుపల్లికి పిల్లలతో సహా ఆమె భర్తను తీసుకువెళ్లింది. ఆయన వెళ్లిన మూడవ రోజుననే కొందరితో కలిసి ఎవరికి తెలియకుండా గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్ళి ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం రమేష్‌ను చంపి ఆ పరిసరాల్లో పూడ్చి పెట్టింది. భర్త ప్రాణాలు తీసి ఎవరికి అనుమానం రాకుండా మామూలుగా పనిపాటలు చేసుకుంటూ వివాహ వేడుకలు కూడా హాజరైంది. ఈ క్రమంలో రమేష్ బంధువులు అతని ఆచూకీ కోసం చేసే ప్రయత్నంలో ఏమి ఎరుగని అమాయకత్వంతో వారికి సహకరించింది. ఈ క్రమంలో పుట్టింట్లో బుధవారం ఆయన పేరుమీద నెల మాసికం కూడా జరిపింది. ఇది తెలిసి బంధువులు, పరిసరాల వారికి అనుమానం వచ్చి నిలదీయగా ఆమె భర్తను హత్య చేసినట్లు ఒప్పుకొని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.

గొడవలతో అత్తింటికి

నడికుడ మండలం నర్సక్కపల్లికి చెందిన మృతుడు రమేష్, శారదలకు కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే తాపీమేస్త్రీ పనిచేసే రమేష్ ఇంట్లో నిత్యం గొడవలు జరుతుండగా అతనిని నమ్మించి తన పుట్టింటికి తీసుకెళ్ళే రెండు రోజులకే ఈ సంఘటన జరిగింది. అయితే రమేష్‌ను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎలా హత్య చేశారు, అందులో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసు దర్యాప్తులో చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News