భువనేశ్వర్: ఎస్పి ఓ మహిళా కానిస్టేబుల్ను పెళ్లి పేరుతో లైంగికంగా వేధించిన సంఘటన ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఐదు సంవత్సరాల క్రితం ఎస్పి అక్షయ కుమార్ నాయక్ మల్కాన్గిరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఓ మహిళ కానిస్టేబుల్ను లైంగికంగా వేధించాడు. ఆ మహిళా కానిస్టేబుల్కు గత ఆరు నెలల క్రితం పెళ్లి సంబంధం కుదురింది. దీంతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. ఫేస్బుక్ లో ఆమె స్నేహితుల వద్ద నుంచి ఫొటోలు తీసుకొని, సోషల్ మీడియాలో ఫోటోలను ఎడిట్ చేసి ఆప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఎస్పి వేధింపులకు విసిగిపోయిన సదరు కానిస్టేబుల్ కళహండి జిల్లాలోని కిసింగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఎస్పి అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కానిస్టేబుల్కు రక్షణ కల్పించాలని హైకోర్టు పోలీసు అధికారులకు సూచించింది.